ఎతియోస్ను బ్రెజిల్ ఉత్పత్తి చేసేందుకు టొయోటా సన్నాహాలు

టొయోటా మోటార్ కార్పోరేషన్ భారత్కు చెందిన కిర్లస్కర్ గ్రూపుతో జాయింట్ వెంచర్గా ఏర్పడి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాగా.. గడచిన డిసెంబర్ నెలలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) దేశీయ మార్కెట్ కోసం రూపొందించిన ఎతియోస్ సెడాన్ కారును విడుదల చేసింది. ఈ మోడల్క మార్కెట్ నుంచి భారీ స్పందన రావడంతో గత నెల ఇందులో హ్యాచ్బ్యాక్ వేరియంట్ ఎతియోస్ లివా మోడల్ను విడుదల చేసింది. దాదాపు 4,000 మంది ఇజనీర్లు ఐదేళ్లపాటు శ్రమించి ఎతియోస్ను అభివృద్ధి చేశారు.
ఎతియోస్ సెడాన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో మరియు లివా హ్యాచ్బ్యాక్ 1.2 లీటర్ పెట్రలో ఇంజన్తో లభిస్తుంది. ఎతియోస్కు పెరుగుతున్న డిమాండును అందుకునేందుకు బెంగుళూరులో రూ. 3,200 కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంటును కంపెనీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. రెండో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా ఏటా 70,000 యూనిట్ల నుంచి 120,000 యూనిట్లకు పెంచింది. ప్రస్తుతం టొయోటా ప్రతినెలా 6,000 యూనిట్ల ఎతియోస్ మరియు లివాలను ఉత్పత్తి చేస్తుండగా, సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్యను 8,000లకు పెంచనుంది. ఈ ఏడాది 60,000 ఎతియోస్ బ్రాండ్ వాహనాలకు విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 20 వేలకు పైగా లివా హ్యాచ్బ్యాక్ను విక్రయించాలని కంపెనీ బావిస్తోంది.


Click it and Unblock the Notifications








