మే 20 నుంచి సాధారణ ఉత్పత్తిని చేపట్టనున్న టొయోటా

Toyota
జపాన్ భూకపం, సునామీల కారణంగా.. ఆటోమొబైల్ రంగంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపాన్ ఆటో దిగ్గజం టొయోటా మోటార్ కార్పోరేషన్ భారతీయ అనుబంధ సంస్థ టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) (కిర్లోస్కర్ గ్రూప్, టొయోటాల జాయింట్ వెంచర్) ఏప్రిల్ 25 నుంచి కంపెనీ ఉత్పత్తిలో 70 శాతం కోతను విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులు మెల్లిగా కోలుకుంటున్న తరుణంలో మే 20 నుంచి భారత్‌లో సాధారణ ఉత్పత్తిని కొనసాగించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో తక్కువ నిర్వహణ, ఉత్పత్తి కుదింపు కారణంగా కంపెనీ ఆదాయంలో దాదాపు రూ. 650 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

ఇప్పటి వరకూ కొరతగా ఉన్న విడిభాగాలు రానున్న రోజుల్లో మెరుగుపడతాయని, అందుకే తాము ఉత్పత్తి విషయంలో అంచనాల కన్నా ముందుగానే సాధారణ పరిస్థితి నెలకొనగలదని భావిస్తున్నామని టికెఎమ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (కమర్షియల్) శేఖర్ విశ్వనాథన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో విడిభాగాల కొరత నేపథ్యంలో కంపెనీ ఏప్రిల్ 25 నుంచి జూన్ 4 మధ్య కాలంలో సోమ, శని వారాలలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసేది. ఫలితంగా అన్ని మోడళ్లపై దాదాపు 10,000 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయామని, దీంతో ఒక్కో వాహణంపై ఆదాయంలో సగటున రూ. 6,50,000 నష్టం వాటిళ్లందిని ఆయన వివరించారు.

More from DriveSpark

Article Published On: Monday, May 16, 2011, 16:53 [IST]
English summary
Japanese car giant Toyota Motor Corporation's Indian arm Toyota Kirloskar Motor (TKM) said it will resume normal production in Indian facility from May 20 after being compelled to slash output by 70% since April 25 due to component supply constraints following the devastating earthquake and tsunami that hit the island nation.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+