బడ్జెట్ 2011 - ప్రస్తుతానికి కార్ల ధరలు పెరగనట్లే..!

Indian Auto Sector
గత వారం రోజులుగా కేంద్ర బడ్జెట్ 2011పై ఆటోమొబైల్ రంగం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ రోజు కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2011- 12లో ఎక్సైజ్ సుంకం సవరింపుల జోలికి వెల్లకపోవడంతో అటు ఆటోమొబైల్ తయారీదారులు, ఇటు కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈసారి బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం ప్రభుత్వం సవరించ వచ్చుననే పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికే పెరిగిన వడ్డీరేట్లు, ముడి సరుకులు మరియు ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

గతేడాది దేశీయ ఆటోమొబైల్ రంగం మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ.. 30 శాతం వృద్ధిని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆటో రంగం కనబరచిన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాంద్యం కారణంగా తగ్గించిన సుంకాలను, ఉద్దీపన పథకాలను ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఉపసంహరించుకోవచ్చునని పరిశ్రమ అంచనా వేసింది. కానీ ప్రభుత్వం మాత్రం కొనసాగుతున్న ఆటో జోరుకు బ్రేక్‌లు వేయడం ఇష్టం లేక సుంకాలును యథాతథంగా ఉంచింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆటో పరిశ్రమ స్వాగతించింది. కాబట్టి ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఇప్పట్లో వాహన ధరలు పెరగకపోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, February 28, 2011, 18:34 [IST]
English summary
The Union Budget 2011-12 has reveled by the Finance Minister Pranab Mukherjee. In this budget central government 
 
 did not made any changes in Exice Duty of automobile sector. Which results that the car price won't go up.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+