ఈబే ఆక్షన్లో రూ. 30 లక్షలు పలికిన ఫోక్స్వ్యాగన్ పస్సాత్ కారు

పది రోజుల పాటు జరిగిన ఈ వేలం మే 10వ తేదీన ముగిసింది. కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన క్రికెట్ ఔత్సాహికుడు సైదాస్ మల్లాడీ రూ. 30.13 లక్షలను వెచ్చించి ఈ కారును దక్కించుకున్నాడు. ఈ కారుతో అన్ని టీ20 జట్ల కెప్టన్లు ఆటోగ్రాఫ్ చేసిన ఓ క్రికెట్ బ్యాట్ను కూడా సొంతం చేసుకున్నాడు.
కాగా.. ఫోక్స్వ్యాగన్ పస్సాత్ కారు ఆటోమేటిక్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ ఆప్షన్లలతో డీజల్ వేరియంట్లో లభ్యమవుతుంది. బ్లూమోషన్ టెక్నాలజీలో ఉన్న స్టార్ట్ స్టాప్, బ్రేక్ ఎనర్జీ రెక్యుపరేషన్ (బ్రేక్ వేస్తే బ్యాటరీ చార్జ్ అవ్వడం), డిఎస్జి డ్యూయెల్ క్లచ్ గేర్ బాక్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అత్యంత ఇంధన సామర్థ్యం గల ఇంజన్ వంటి అధునాతన ఫీచర్లతో ఇది లభిస్తుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో తమ బ్లూమోషన్ టెక్నాలజీ ఓ కొత్త వరవడిని సృష్టించగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications








