మారుతి సుజికి 'ఏ-స్టార్' కార్లపై కన్నేసిన వోక్స్వ్యాగన్

ఈ ఒప్పందంలో భాగంగా మారుతి తన ఏ-స్టార్ కార్లను తొలుత వోక్స్వ్యాగన్కు విక్రయిస్తుంది. అనంతరం వోక్స్వ్యాగన్ ఏ-స్టార్ కార్లకు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి భారత్, ఆసియా మార్కెట్లలో కొత్త బ్రాండ్ పేరుతో విక్రయించనున్నట్లు సమాచారం. మారుతి మాతృసంస్థ అయిన సుజికి మోటార్ కార్పోరేషన్లో వోక్స్వ్యాగన్కు 20 శాతం వాటా ఉంది. సుజికి ఇప్పటివరకూ స్విఫ్ట్, రిట్జ్, ఎస్ఎక్స్4, గ్రాండ్ విటారా కార్లను అంతర్జాతీయంగా బ్రాండ్లుగా కలిగి ఉంది. ఈ ఒప్పందం కనుక విజయవంతమైతే మారుతికి ఏ-స్టార్ కారు ఐదవ గ్లోబల్ బ్రాండ్ కానుంది.
రెండేళ్లపాటు మారుతి ఏ-స్టార్ కార్లను సరఫరా చేయడంలో విజయవంతం కావడాన్ని చూసి వోక్స్వ్యాగన్ కూడా ఏ-స్టార్ కార్లపై కన్నేసినట్లుంది. మారుతి తన ఏ-స్టార్ కార్లను జపాన్కు నిస్సాన్ మోటార్స్కు సరఫరా చేసేది. నిస్సాన్ ఈ మోడల్ను కొద్దిగా మార్పులు చేసి "పిక్సో" అనే బ్రాండ్ నేమ్తో యూరప్లో ఉన్న స్వంత నెట్వర్క్ ద్వారా విక్రయిస్తుంది. అంతేకాకుండా.. పూర్తిగా మారుతి సుజికి తయారు చేస్తున్న ఆల్టో కార్ల మాదిరిగానే ఏ-స్టార్ కార్లు కూడా విదేశీ మార్కెట్లలో లభ్యం కానున్నాయి.


Click it and Unblock the Notifications








