ప్రపంచ కప్ గెలిస్తే.. జట్టులోని ప్రతి ఒక్కరికి కారు ఫ్రీ..!

ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ శనివారం జరుగుతున్న శ్రీలంక-ఇండియా ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు గెలవాలని కోరుకుంటున్నామని, ఈ మ్యాచ్లో భారత జట్టు గెలిస్తే.. జట్టులోని ప్రతిఒక్కరికి ఇంకా మార్కెట్లోకి కూడా విడుదల కాని సరికొత్త వెర్నా వేరియంట్ కారును అందిస్తామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ హెచ్.డబ్ల్యూ. పార్క్ చెప్పారు.
కొరియాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ అయిన హ్యుందాయ్ మోటార్ ప్రపంచ కప్ 2011కు అధికారిక కార్ పార్టనర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యతో హ్యుందాయ్ ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మరో నాలుగేళ్ల పాటు హ్యుందాయ్ ఐసీసీతో సహకరించనుంది. ఈ ఒప్పందం 2015 వరకూ కొనసాగనుంది.


Click it and Unblock the Notifications








