శ్రీలంకను చూసి ఏం భారత్ నేర్చుకోవాలి..?

సరే, ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే.. దిగుమతి చేసుకునే వాహనాలపై శ్రీలంక ప్రభుత్వం కఠినమైన పన్ను విధానాన్ని ఆచరిస్తోంది. అదేంటంటే.. హైబ్రిడ్ కార్లపై దిగుమతి సుంఖం కేవలం 50 శాతమ మాత్రమే వసూలు చేస్తుంటే.. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే కార్లపై దిగుమతి సుంఖాన్ని ఏకంగా 450 శాతానికి పెంచింది. ఫలితంగా ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో శ్రీలంక 5.36 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ను ఆదా చేసుకోగలిగింది.
ఈ భారీ దిగుమతి సుంఖాల కారణంగా ఇటీవలి కాలంలో అక్కడ హైబ్రిడ్ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. శ్రీలంకలో హైబ్రిడ్ కార్ల ధరలు దాదాపు శిలాజ ఇంధనాలతో నడిచే కార్ల ధరలకు సమానంగా ఉంటాయి. కానీ భారత్లో మాత్రం.. పెట్రోల్, డీజిల్తో నడిచే కార్ల కన్నా ఇవి 70 శాతం నుంచి 100 శాతం వరకూ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా.. హైబ్రిడ్ కార్లకు కావాల్సిన సరైన మౌలిక సదుపాయాలు మనదేశంలో అంతంత మాత్రంగా ఉన్నాయి.
అందవల్లనే భారత్లో హైబ్రిడ్ కార్లు పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. ఇంధనాన్ని ఇలానే వినియోగిస్తూ పోతుంటే భవిష్యత్తులో ఈ వాహనాల వినియోగం ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంకలో పటిష్టమైన ఆటోమొబైల్ రంగం లేదు. కానీ మనదేశంలో ఉంది. ఏదేమైనప్పటికీ.. మిగిలిన విషయాలు అటుంచితే, పర్యావరణ పరిరక్షణ విషయంలో శ్రీలంక పాటిస్తున్న విధానాలను మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications








