ఆడి ఇండియా జనవరి విక్రయాలు అదుర్స్

ఈ ఏడాది భారత మార్కెట్లో 4,000 ఆడి కార్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించామని, ఇందుకోసం ఇప్పటికే కంపెనీ ప్రిమీయం లగ్జరీ సెడాన్ ఆడి ఏ8 (ధర రూ. 89 లక్షలు)ను ప్రవేశపెట్టిందని, త్వరలోనే ఏ-సిరీస్లో మరో రెండు లగ్జరీ మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు. కాగా.. తాజాగా విడుదల చేసిన ఆడి ఏ8 లగ్జరీ కారు 4.2 ఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్తో తక్కువ బరువు ఉండే అల్యూమినియం బాడీతో లభిస్తుంది. దీని ఇంటీరియర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆడి ఇండియా న్యూఢిల్లీలో 30 వేల చదరపు అడుగులు కలిగిన అతిపెద్ద కార్ల షోరూమ్ను కూడా ప్రారంభించింది. ఇందులో 20 మోడళ్లను కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.


Click it and Unblock the Notifications








