బడ్జెట్ ఎఫెక్ట్: మారుతి సుజుకి ఎర్టిగా ధర మరింత ప్రియం!
ఒకవేళ బడ్జెట్ కన్నా ముందుగా ఎర్టిగాను విడుదల చేసి ఉన్నట్లయితే, బడ్జెట్ అనంతరం మరోసారి ఈ కారు ధరను సవరించాల్సి వచ్చేది. అదే గనుక జరిగి ఉంటే ఎర్టిగా అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉండేది. ఇవన్నీ ఆలోచించిన మారుతి సుజుకి సుజుకి తెలివిగా ఒకేసారి సవరించబడిన ధరతోనే ఎర్టిగాను దేశీయ విపణిలోకి తీసుకురానుంది. అయితే, ఈ ఎమ్పివి ధర గతంలో అనుకున్న దాని కన్నా కాస్తంత ఎక్కువగా ఉండనుంది.
ప్రస్తుత బడ్జెట్లో పెద్ద కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 22 శాతం నుండి 27 శాతానికి పెంచడం వలన ఎర్టిగా ధర కూడా ప్రభావితం కానుంది. మారుతి సుజుకి తమ ఎర్టిగా ఎమ్పివిని వచ్చే నెల 11వ తేదీన వాణిజ్యపరంగా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. ఇండియాలో తయారవుతున్న ఎర్టిగా ఎమ్పివిని ఇండోనేషియా మార్కెట్కు కూడా ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications









