గుర్గావ్ డీజిల్ ఇంజన్ ప్లాంటుపై మరో 2 నెలల్లో నిర్ణయం: మారుతి

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో డీజిల్ ఇంధనంతో నడిచే కార్ల హవా రోజు రోజుకి పెరుగుతన్న సంగతి తెలిసిందే. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులు అందిచలేకపోయినట్లయితే మార్కెట్లో ఎక్కువ కాలం అగ్రగామిగా కొనసాగటం కష్టం. ఈ విషయాన్ని గ్రహించిన మారుతి సుజుకి ప్రస్తుతం డీజిల్‌తో నడిచే కార్లపై ఎక్కువ శ్రద్ధ చూపేందుకు సన్నహాలు చేస్తుంది.

గుర్గావ్‌లో డీజిల్ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేసే విషయంపై తటపటాయిస్తున్న దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మరో రెండు నెలల్లో ఈ ప్లాంటు గురించి ఓ ఖచ్ఛితమైన నిర్ణయాన్ని వెల్లడించనుంది. బడ్జెట్‌లో డీజిల్ టాక్స్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవటంతో, డీజిల్ కార్ల ఉత్పత్తి పెంపు గురించి వీలైనంత త్వరగా ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం డీజిల్ ఇంజన్ల పరిమిత సరఫరా కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, ఈ నేపథ్యంలో తామే స్వతహాగా డీజిల్ ఇంజన్లను తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, కాబట్టి మరో రెండు నెలల లోపుగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నామని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ షింజో నకనిషి తెలిపారు. ప్రస్తుతం సుజుకి పవర్‌ట్రైన్, ఫియట్‌ల నుండి మారుతి డీజిల్ ఇంజన్లను కొనుగోలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 21, 2012, 15:13 [IST]
English summary
Maruti Suzuki India will decide within two months on setting up a diesel engine unit at its Gurgaon plant Maruti Suzuki India Managing Director Shinzo Nakanishi said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+