హ్యుందాయ్ ఇండియా ఉన్నత యాజమాన్యంలో మార్పులు
దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) ఉన్నత యాజమాన్యంలో మార్పులు చోటుచేసుకున్నాయని కంపెనీ పేర్కొంది. బో షిన్ సెయోను తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా నియమించుకోనున్నట్లు హెచ్ఎమ్ఐఎల్ తెలిపింది.
ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్న హాన్ వూ పార్క్ స్థానంలో సెయో బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్క్ను కొరియాలోని తమ అనుబంధ కంపెనీ కియో మోటార్స్కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు హ్యుందాయ్ వెల్లడించింది.
ఈ ఉన్నత యాజమాన్య మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ముందు సెయో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొడక్షన్గా పనిచేశారు. ఈ పదవిలో ఆయన దాదాపు రెండేళ్లపాటు కొనసాగారు. ఇక ఇండియాలో తొమ్మిదేళ్లు పనిచేసిన పార్క్ నవంబర్ 2009లో హ్యుందాయ్ ఇండియాకు మేనేజింగ్ డైరక్టర్ అయ్యారు.


Click it and Unblock the Notifications









