జేఎల్ఆర్ యూకే ప్లాంటులో 1,000 కొత్త కొలువులు
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు చెందిన హాలేవుడ్ ప్లాంట్లో కొత్తగా 1,000 మందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది. జేఎల్ఆర్ అందిస్తున్న లగ్జరీ ఎస్యూవీలు రిక్రూట్ రేంజ్ రోవర్ ఈవోక్, ఫ్రీల్యాండర్ -2 మోడళ్లకు గ్లోబల్ మార్కెట్లో డిమాండు జోరందుకోవడంతో కొత్తగా సిబ్బందిని తీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది.
ఈ ప్లాంటులో 24 గంటలు కార్యకలాపాలు జరుగుతుండేలా 3వ షిఫ్టును ప్రారంభించేందుకు కొత్త నియామకాలు చేపడుతున్నామని, తాజా నియమాకాలతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 4,500 మందికి పెరుగుతుందని జేఎల్ఆర్ పేర్కొంది.
ఈ నియామాకాల గురించి జాగ్వార్ ల్యాండ్ రోవర్ హెచ్ఆర్ డైరెక్టర్ డేస్ త్రూబి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ మోడళ్లకు మంచి డిమాండ్ ఉండటంతో, ఈ ప్లాంటులో మూడు షిఫ్టులు ప్రారంభించేందుకు కొత్త నియమాకాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రొడక్షన్ ఆపనేటర్లు, సూపర్వైజర్లు, ఇంజినీర్ల పోస్టుల కోసం కొత్తగా నియామకాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications









