రాష్ట్ర మార్కెట్లోకి విచ్చేసిన మహీంద్రా సరికొత్త 2012 జైలో
పాత జైలోతో పోల్చుకుంటే దాదాపు 50 మార్పులు కొత్త జైలోలో ఉంటాయని కంపెనీ వివరించింది. తెలిపింది. 2012 వెర్షన్ జైలో ఎమ్పివి డి2, డి4, ఈ4, ఈ8, ఈ9 అనే ఐదు వేరియంట్లలో, ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభించనుంది. రాష్ట్ర మార్కెట్లో కొత్త జైలో ధరలు రూ.7.37 లక్షల నుండి రూ.10.24 లక్షల మధ్యలో ఉన్నాయి. మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది.
కొత్త మహీంద్రా జైలో ఈ9 వేరియంట్లో స్కార్పియోలో ఉపయోగించే 2.2లీటర్ ఎమ్హాక్ ఇంజన్ను ఉపయోగించారు, ఇది 120 బిహెచ్పిల శక్తిని, 290 ఎన్ఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. అలాగే, ఈ4, ఈ8 వేరియంట్లలో ఉపయోగించిన 2.5 లీటర్ ఎమ్ఈగల్ ఇంజన్ 112 బిహెచ్పిల శక్తిని, డి2, డి4 వేరియంట్లలో ఉపయోగించిన ఎమ్డిఐ ఇంజన్ 95 బిహెచ్పిల శక్తిని విడుదల చేస్తుంది.
ఐదు వేరియంట్లలో లభ్యమయ్యే కొత్త జైలో ఎమ్పివి వేరియంట్ను బట్టి లీటరుకు 13-15 కి.మీ. మైలేజీనిస్తుంది. కొత్త జైలో డిజైన్ మార్పు కోసం రూ.50 కోట్లు వెచ్చించామని, యుటిలిటీ వాహనాల మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రాకు 27 శాతం మార్కెట్ వాటా ఉందని, ఆంధ్రప్రదేశ్లోనూ కొత్త జైలోకు మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications









