మహీంద్రా వాహనాలకు కరూర్ వైశ్యా బ్యాంక్ రుణాలు

కరూర్ వైశ్యా బ్యాంక్కు దేశవ్యాప్తంగా ఉన్న 450కి పైగా బ్రాంచ్ల ద్వారా తమ వినియోగదారులు వాహన రుణాలు పొందవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఎమ్ అండ్ ఎమ్కు దేశవ్యాప్తంగా 250కు పైగా డీలర్షిప్ కేంద్రాలున్నాయి. ఈ ఒప్పందంపై కరూర్ వైశ్యా బ్యాంక్ జనరల్ మేనేజర్ కె.వి. రావు, మహీంద్రా అండ్ మహీంద్రా, సౌత్ సెక్టార్ సీనియర్ సేల్స్ మేనేజర్ అతుల్ సిన్హాలు సంతకాలు చేశారు.
ప్యాసింజర్, వాణిజ్య వాహనాల ఫైనాన్సింగ్లో కెవిబి తమ కార్యకలాపాలను విస్తరించుకుంటుందని, మహీంద్రా అండ్ మహీంద్రాతో ఒప్పందం కుదర్చుకోవటంతో తమకెంతో సంతోషంగా ఉందని వెంకటరామన్ తెలిపారు.


Click it and Unblock the Notifications








