ఎక్సైజ్ సుంఖం పెంపు: కార్ల ధరలను పెంచిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ అందిస్తున్న బుజ్జి కారు టాటా నానో ధర పెరగనుందా..? అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో చిన్న కార్ల నుండి పెద్ద కార్ల వరకూ ఎక్సైజ్ సుంఖాన్ని పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చిన్న కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 10 శాతం నుండి 12 శాతానికి, పెద్ద కార్లపై 22 శాతం నుండి 27 శాతానికి ప్రభుత్వం పెంచిది.
ఈ నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే టాటా మోటార్స్ ఉత్పత్తులను ధరల పెంపుపై తమ నిర్ణయాన్ని ప్రకటించింది. తాము అందిస్తున్న అన్ని రకాల వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల ధరలను తక్షణమే పెంచుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. యూనియన్ బడ్జెట్లో ఎక్సైజ్ సుంఖాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది.
కాగా.. టాటా మోటార్స్ ఇతర ఆటోమొబైల్ కంపెనీలు త్వరలోనే తమ తమ ఉత్పత్తుల ధరల పెంపు గురించి ఓ నిర్ణయాన్ని వెల్లడించనున్నాయి.


Click it and Unblock the Notifications









