రూ. 1,700 కోట్లతో గుర్గావ్‌లో డీజిల్ ఇంజన్ ప్లాంటు: మారుతి

Maruti Suzuki SX4
దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో డీజిల్ ఇంజన్‌తో నడిచే కార్ల వాటాను పెంచుకునేందుకు భారీ ప్రణాళికలకు శ్రీకారం చుడుతోంది. కంపెనీ గతంలో పేర్కొన్నట్లుగానే తమ వాహనాల కోసం డీజిల్ ఇంజన్లను తామే తయారు చేసేకోనుంది. ఇందుకు గాను గుర్గావ్‌లో రూ.1,700 కోట్ల పెట్టుబడితో ఓ డీజిల్ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

గుర్గావ్‌లో ఏటా మూడు లక్షల డీజిల్ ఇంజన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఓ ప్లాంటు నిర్మించడం కోసం రూ.1,700 కోట్లను వెచ్చించనున్నామని మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు. ఈ ప్లాంటులో 2013 మధ్యభాగం నాటికి ప్రారంభంలో భాగంగా 1.5 లక్షల డీజిల్ ఇంజన్ల ఉత్పత్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, 2014 నాటికి ఇది పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వస్తుందని ఆయన తెలిపారు.

మొదటి దశలో భాగంగా రూ.950 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తామని, అనంతరం ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు మిగిలిన పెట్టుబడులను వెచ్చిస్తామని భార్గవ వివరించారు. బడ్జెట్‌లో డీజిల్ కార్లపై ప్రభుత్వం ఎలాంటి అధనపు సుంఖాలను విధించకపోవటంతో ఆటోమొబైల్ కంపెనీలు డీజిల్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం సుజుకి పవర్‌ట్రైన్, ఫియట్‌ల నుండి మారుతి సుజుకి డీజిల్ ఇంజన్లను కొనుగోలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 24, 2012, 17:48 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki India (MSI) said it will invest Rs 1,700 crore to set up a diesel engine plant, with a total annual production capacity of three lakh units, at its Gurgaon facility by 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+