డీజిల్ ధరలపై నియంత్రణలు ఎత్తివేసే యోచన లేదు: జైపాల్ రెడ్డి
పెట్రోల్ ధరల మాదిరిగానే డీజిల్ ధరలపై కూడా ప్రభుత్వ నియంత్రణలను తొలగించవచ్చే వాదనకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి డీజిల్ ధరలపై నియంత్రణ తొలగించే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర చమురు శాఖా మంతిరి ఎస్. జైపాల్రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే పెట్రోల్ ధరలపై నియంత్రణలు తొలగించినప్పటికీ, గత కొద్ది నెలలుగా అది అమలు కావడం లేదని, పెట్రోల్ ధరలపు తిరిగి నియంత్రణలు విధించేందుకు కేంద్రం సముఖంగా లేదని ఆయన వివరించారు.
శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఆసియా గ్యాస్ భాగస్వామ్య సదస్సుకు విచ్చేసిన జైపాల్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ.. డీజిల్ ధరలను డీకంట్రోల్ (ఆంక్షలు ఎత్తివేయటం) చేయాలనే యోచన ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో స్పష్టం చేశారు. సబ్సిడి ధలకే డీజిల్ను విక్రయిస్తుండటం వలన చమురు కంపెనీ ప్రతి లీటరు డీజిల్ అమ్మకంపై రూ.14.73 చొప్పన నష్టపోతున్నాయి. ప్రస్తుతం ఈ నష్టాన్ని కేంద్రమే భరిస్తుంది. డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేస్తే ఇది అమాతం పెరిగిపోయే ఆశ్కారం ఉంది.


Click it and Unblock the Notifications









