గుర్గావ్లో 3 యూనియన్ లీడర్లను సస్పెండ్ చేసిన సుజుకి

సుజుకి మోటార్సైకిల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఎస్ఎమ్ఈయూ) వైస్ ప్రెసిడెంట్ ప్రమీందర్ కుమార్, జనరల్ సెక్రటరీ అవినాష్ కుమారా, సెక్రటరీ గుల్షన్ కుమార్లను కంపెనీ సస్పెండ్ చేయటమే కాకుండా ప్లాంటులోనికి అనుమతించకుండా బహిష్కరించటం కూడా జరిగింది.
సుజుకి మోటార్సైకిల్ గుర్గావ్ ప్లాంటులోని ఓ సీనియర్ అధికారికితో వీరు ముగ్గురు గొడవకు దిగారన్న నెపంతో, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని సస్పెండ్ చేశామని సుజుకి వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) అనీల్ ముంజాల్ తెలిపారు.
అయితే, కంపెనీలో ఉద్యోగులకు ఇన్సెంటివ్లు ఇష్టం లేని కారణంగా ప్లాంటులో వర్కర్ల వాతావరణాన్ని కంపెనీ పాడు చేస్తుందని యూనియన్ సభ్యులు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తాజా పరిణామాలు వెంటనే సద్దుమణగకపోతే మానేసర్-గుర్గావ్ బెల్ట్ మరోసారి సమ్మె సెగతో భగ్గుమనే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








