పెట్రోల్ ధరను భారీగా తగ్గించిన గోవా, మరి ఇతర రాష్ట్రాలో..?

పెట్రోల్ ధరపై వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ టాక్స్)ను తగ్గించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. గోవా తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో దేశంలోనే అత్యంత చవక ధరకే పెట్రోల్ విక్రయిస్తున్న రాష్ట్రంగా గోవా నిలువనుంది. విమానాలకు ఉపయోగించే ఇంధనంపై కూడా వ్యాట్ను తగ్గించాలని మనోహర్ రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించారు.
దీంతో అనేక విమానాలు గోవాలోనే పెట్రోల్ను ఫిల్ చేసుకునే ఆస్కారం ఉంది. గోవాకు సరిహద్దు రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా ప్రజలు గోవాకు వెళ్లి పెట్రోల్ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ బడ్జెట్ పాస్ అయితే ఈ ధరల తగ్గింపు ఐదేళ్ల పాటు అమలులో ఉంటుందని మనోహర్ ప్రకటించారు.
వాస్తవానికి పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేసిన తర్వాత, ఇది చమురు కంపెనీలు చేతిలోకి వెళ్లింది. అంతర్జాతీ మార్కెట్లో ముడి ధరల ప్రకారం ఇక్కడి మార్కెట్లో కూడా పెట్రోల్ ధరను తగ్గించడం, పెంచడం వంటివి చమురు కంపెనీలు చేస్తాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం, ప్రతి 15 రోజులకు ఒకసారి చమురు కంపెనీలు సమావేశమై పెట్రోల్ ధరలను సమీక్షించడం జరుగుతుంది.
అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా, చమురు కంపెనీలు గడచిన డిసెంబర్ నెల నుండి పెట్రోల్ ధరల జోలికివెళ్లలేదు. ఈ నేపథ్యంలో గోవా తీసుకున్న నిర్ణయం పట్ల ఇతర రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. పెట్రోల్ ధరల విషయంలో గోవా రాష్ట్రాన్నే ఇతర రాష్టాలు కూడా ఫాలో అవుతాయా..? మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








