జోరుగా సాగుతున్న యమహా స్పోర్ట్స్ బైక్ అమ్మకాలు
మార్చి 2011లో 25,786 యూనిట్లను విక్రయించగా, ప్రస్తుత సంవత్సరం మార్చి నెలలో 29,819 యూనిట్లను విక్రయించామని యమహా వెల్లడించింది. ఇదే సమయంలో ఎగుమతులు కూడా 10,982 యూనిట్ల నుండి 12,067 యూనిట్లకు పెరిగాయి. గడచిన సంవత్సరంతో పోలిస్తే మొత్తమ్మీద మార్చి 2012 నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు (ఎగుమతులు, దేశీయ అమ్మకాలు కలిపి) 36,768 యూనిట్ల నుండి 41,886 యూనిట్లకు పెరిగి 13.9 శాతం వృద్ధిని సాధించాయి.
డీలక్స్, ప్రీమియం సెగ్మెంట్లో తాము అందిస్తున్న వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0, ఎఫ్జెడ్ సిరీస్, ఎస్జెడ్ సిరీస్ మోడళ్లకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోందని, సేల్స్, సర్వీస్, స్పేర్స్ విషయంలో ఉత్తమమైన సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, రానున్న రోజుల్లో టైర్-2, టైర్-3 నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ సబ్-డీలర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ హిరోయుకి సుజుకి తెలిపారు.


Click it and Unblock the Notifications









