హ్యుందాయ్ను వదలి ఫోక్స్వ్యాగన్లో చేరిన సక్సేనా
జర్మనీకు చెందిన కార్ కంపెనీ ఫోక్స్వ్యాగన్ భారతీయ యూనిట్కు మేనేజింగ్ డైరెక్టర్గా అరవింద్ సక్సేనా ఎన్నికయ్యారు. ఈ మేరకు అరవింద్ సక్సేనాను ఇండియాలోని ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ విభాగాని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించుకుంటున్నామని కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఫోక్స్వ్యాగన్ గ్రూప్ ప్రెసిడెంట్ జార్జ్ డోరియాస్ పేర్కొన్నారు.
ఉత్తమ మార్కెటింగ్ ప్రణాళికలతో హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లిన అరవింద్ సక్సేనా, తమ కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించగలరని ఫోక్స్వ్యాగన్ ఇండియా ధీమా వ్యక్తం చేసింది. ఈ రంగంలో సక్సేనాకు 30 ఏళ్లకు పైగా అనుభం ఉంది. ఈయన నేతృత్వంలో కంపెనీ అమ్మకాలను మరింత వృద్ధిని సాధించగలవని డోరియాస్ అన్నారు.
ఈ సందర్భంగా అరవింద్ సక్సేనా మాట్లాడుతూ.. ఫోక్స్వ్యాగన్లో భాగం పంచుకోవడానికి తనకెంతో సంతోషంగా ఉందని, ఈ రంగంలో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కుని ఫోక్స్వ్యాగన్ అభివృద్ధిలో పాలుపంచుకుంటానని చెప్పారు. సక్సేనా హ్యుందాయ్ మోటార్ ఇండియాలో పనిచేయడానికి ముందు మారుతి సుజుకి ఇండియా కంపెనీలో కూడా విధులు నిర్వహించారు.


Click it and Unblock the Notifications









