వాణిజ్య వాహనాల ధరలను తగ్గించిన అశోక్ లేలాండ్

AL Dost
హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ వాణిజ్య వాహనాల ధరలను తగ్గించింది. తాము అందిస్తున్న వివిధ రకాల వాణిజ్య వాహనాల ధరలను ఒక శాతం మేర తగ్గించామని అశోక్ లేలాండ్ ఓ ప్రకటనలో పేర్కొంది. వాణిజ్య వాహనాల్లో అత్యంత కీలకమైన ట్రక్ షాషీ (ఛాస్సిస్)లపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించడంతో తాము కూడా ధరలు తగ్గించాలని నిర్ణయించామని కంపెనీ వివరించింది.

ఈ ధరల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని అశోక్ లేలాండ్ తెలిపింది. షాషీలపై ఎక్సైజ్ సుంకాన్ని 15 శాతం నుంచి 14 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కస్టమర్లపై కొంత భారాన్ని తగ్గించాలని భావించామని, అందుకే వాణిజ్య వాహనాల ధరలను కూడా ఒక శాతం మేర తగ్గిస్తున్నామని అశోక్ లేలాండ్ పేర్కొంది.

ఈ ఏడాది మార్చి నెలలో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌ 2012-13లో సర్కారు వాణిజ్య వాహనాల ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో అశోక్ లేలాండ్ కంపెనీ ఈ నెల ఆరంభంలో ధరలను 5 శాతం వరకూ పెంచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ప్యాసింజర్ వాహనాన్ని త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని హిందూజా ఆటోమోటివ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వి.సుమంత్రన్ గతంలో తెలిపారు. అంతేకాకుండా ఏ ఏడాదిలోనే దోస్త్ ఎల్‌సీవీలో ఓ సీఎన్‌జీ వెర్షన్ అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Saturday, May 12, 2012, 16:39 [IST]
English summary
Hinduja Group flagship company Ashok Leyland Ltd said, it is reducing prices off all range of commercial vehicle after a recent decrease in excise duty on chassis. Earlier this week, the Government of India had cut excise duty on commercial vehicles chassis to 14 percent.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+