జూన్ 2012 నాటికి మార్కెట్లోకి రానున్న ఆడి క్యూ3
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా, గడచిన జనవరిలో ఢిల్లీలో జరిగిన 2012 ఆటో ఎక్స్పోలో ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చేతుల మీదుగా ఆవిష్కరించిన సరికొత్త "క్యూ3" ఎస్యూవీని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. మార్కెట్ సమాచారం ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి ఆడి క్యూ3 ఎస్యూవీ భారత మార్కెట్లో వాణిజ్యపరంగా లభ్యం కానుంది.
ఆల్-వీల్ (ఫోర్-వీల్) డ్రైవ్ సిస్టమ్తో లభించనున్న ఆడి క్యూ3లో తొలుత 2.0 లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్ను అమర్చనున్నారు. ఇది 177 బిహెచ్పిల శక్తిని విడుదల చేయనుంది. అలాగే, ఇందులో 2.0 లీటర్ డైరెక్ట్ ఇంజక్షన్ పెట్రోల్ ఇంజన్ను కూడా కంపెనీ విడుదల చేసే ఆస్కారం ఉంది. ఇది సెప్టెంబర్ నెల నాటికి మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని అంచనా.
డీజిల్ వేరియంట్ ఆడి క్యూ3 ఎస్యూవీ ధర రూ.23-26 లక్షల రేంజ్లో ఉండనుంది. బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 ఎస్యూవీ, మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్ బెంజ్ బి క్లాస్ వంటికార్లకు ఇది పోటీగా నిలువనుంది. క్యూ3 ఎస్యూవీను ఔరంగాబాద్ ప్లాంట్లో అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ సవంత్సరంలో ఆడి క్యూ3 ఎస్యూవీ తమకు అత్యంత కీలకమైన ఉత్పత్తి అని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ అన్నారు.


Click it and Unblock the Notifications









