పోటీదారులకు చెక్ పెట్టేందుకు ఆడి ఇండియా మాస్టర్ ప్లాన్స్

ఆడి నుండి అత్యంత విజయవంతమైన క్యూ7, క్యూ3 ఎస్యూవీలను ఔరంగాబాద్ ప్లాంట్లో అసెంబ్లింగ్ చేయాలని భావిస్తున్నామని, ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 8,000 యూనిట్లకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 2012లో తమ వృద్ధికి, క్యూ3 ఎస్యూవీ అత్యంత కీలకమైన ఉత్పత్తి అని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.
మరికొద్ది సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఓ సరికొత్త మోడల్ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన చెప్పారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఆడి క్యూ3 ఎస్యూవీ ధర రూ.25-30 లక్షల మధ్యలో ఉండనుంది. బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 ఎస్యూవీ, మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్ బెంజ్ బి క్లాస్ వంటికార్లకు ఇది పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








