బడ్జెట్ ఎఫెక్ట్: నిలిచిపోయిన రూ.3,000 కోట్ల పెట్టుబడులు

నేడు రైల్వే బడ్జెట్ 2012-13 విడుదలైన సంగతి తెలిసిందే. యూనియన్ బడ్జెట్ 2012-13 పూర్తిగా వెలువడటానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో డీజిల్ ధరల విధానంపై ఇప్పటికీ ఓ స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవటంతో, ఆటోమొబైల్ కంపెనీలు డీజిల్ టెక్నాలజీపై పెట్టుబడి పెట్టే విషయంపై ఆలోచనలో పడ్డాయి. ఫలితంగా ఇండియాలో భారీ మొత్తంలో పెట్టుబడులు నిలిచిపోయాయి.

యూనియన్ బడ్జెట్‌లో డీజిల్ ధరల విధానంపై స్పష్టత లేని కారణంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు డీజిల్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నాయని, ఫలితంగా రూ.3,000 కోట్లకు పైగా పెట్టబడులు పెండిగ్‌లో ఉండిపోయాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు.

అయితే, ఏయే ఆటోమొబైల్ కంపెనీ ఎంత మేర పెట్టుబడులను వెచ్చించనుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో డీజిల్ ధరల పెంపు, డీజిల్ వాహనాలపై అధిక పన్నుల విధించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన విధానం ఇంత వరకూ తెలియరాలేదు. ఫలితంగా ఆటోమొబైల్ కంపెనీలు బడ్జెట్ వెలువడిన తర్వాతనే డీజిల్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టే విషయం గురించి ఆలోచించనున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 14, 2012, 16:16 [IST]
English summary
According to Society of Indian Automobile Manufacturers (SIAM), automobile companies in the country like Maruti Suzuki, Hyundai, General Motor, Ford and Tata Motors have hold nearly Rs.3,000 crore investments due uncertainty on the diesel price policy at the upcoming union budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+