భారత్‌లో భారీ పెట్టుబడులను పెట్టనున్న కాంటినెంటల్

Continental AG
జర్మనీకు చెందిన ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ కాంటినెంటల్ భారత మార్కెట్లో తన ప్రస్థానాన్ని విస్తరించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పుడిప్పుడే దేశీయ విపణిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ కంపెనీ రానున్న రెండేళ్లలో భారత్‌లో రూ.800 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు ప్రకటించింది.

ఇక్కడి మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించుకునేందుకు గానూ, అలాగే రేడియల్ టైర్ల విభాగంలోకి ప్రవేశించేందుకు గానూ ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో టైర్ల ఉత్పత్తి కోసం గడచిన సంవత్సరంలో 18.5 మిలియన్‌ల యూరోల పెట్టుబడితో ఏడాది మోడీ టైర్స్‌ను కాంటినెంటల్ ఏజి టేకోవర్‌ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టీవీఎస్ మోటార్‌సైకిల్స్ అందిస్తున్న అపాచీ 180 ఆర్‌టిఆర్ ఏబిఎస్ బైక్‌కు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను కాంటినెంటల్ కంపెనీయే సరఫరా చేస్తుంది. భవిష్యత్తులో తమ ఆర్ అండ్ డి వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నామని, బెంగళూరులో ఓ కొత్త కస్టమర్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Monday, January 9, 2012, 12:41 [IST]
English summary
German auto component-maker Continental AG will invest over Rs 800 crore in India over the next two years to strengthen its operations in the country, as well as make an entry into the radial tyres segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+