ఇప్పట్లో డీజిల్ ధరలను పెంచే యోచన లేదు: జైపాల్ రెడ్డి
మరోవైపు డీజిల్ ధరలపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ స్పందిస్తూ.. డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని పెంచడానికి బదులుగా డీజిల్ ధరలను పెంచాల్సిందిగా ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఇలా ఒకే సర్కారులోని వివిధ మంత్రిత్వ శాఖలు, డీజిల్ ధరలపై విభిన్న వైఖరులు తెలియజేడం ఆందోళన కలిగించే విషయమే.
ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కారణంగా గడిచిన నెలలుగా ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచకుండా ఉంచిన సంగతి తెలిసిందే. దీనివలన ప్రభుత్వరంగ చమురు కంపెనీలకు వాటిళ్లుతున్న నష్టాలకు ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లించాలని ఎస్.జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
డీజిల్ ధరలకు స్వేచ్ఛ కల్పించడం చాలా క్లిష్టమైన అంశమని, అయితే తగిన సమయంలో డీజిల్పై సబ్సిడీని తగ్గిస్తామని, కానీ ఆ సమయం ఇంకా రాలేదని మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతానికి డీజిల్ రేట్లను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని అన్నారు.
సబ్సిడి ధరలకే పెట్రోల్ను విక్రయిస్తయిన్న కారణంగా, చమురు కంపెనీలకు ఏర్పడుతున్న నష్టాలను ప్రభుత్వం భర్తీ చేయాలన్న ఆయిల్ కంపెనీల డిమాండ్కు జైపాల్ రెడ్డి మద్దతు పలికారు. ఈ విషయాన్ని తాము కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.


Click it and Unblock the Notifications









