డీజిల్ కార్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంచకండి; డీజిల్ ధరను పెంచండి

డీజిల్ కార్లపై అదనపు సుంకాలను విధించడానికి బదులుగా డీజిల్ ధరలను పెంచితే సరిపోతుందని ఈ శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ప్రణాళికా సంఘం (ప్లానింగ్ కమిషన్)తో సమావేశమైన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ, డీజిల్ కార్లపై అదనంగా సుంకాన్ని వసూలు చేయడానికి బదులుగా, డీజిల్ ధరను ప్రతి లీటరుపై 75 పైసల చొప్పున పెంచినట్లయితే సరిపోతుందని సూచనలు చేసింది.
అయితే, కేంద్ర సర్కారు ఈ సూచనలను కనీసం పరిగణలోకి కూడా తీసుకునే అవకాశాలు కనబడటం లేదు. గడచిన బడ్జెట్లో కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల జోలికి వెళ్లలేదు. సబ్సిడిలో విక్రయిస్తున్న డీజిల్ కారణంగా ఒవైపు ఇప్పటికే చమురు కంపెనీలు నష్టపోతుండగా, మరోవైపు డీజిల్ ధరలను పెంచితే అది నేరుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే ఆస్కారం ఉంది.
డీజిల్ ధరలను పెంచడం వలన కేవలం ప్యాసింజర్ కార్ల అమ్మకాలపై మాత్రమే ప్రభావం చూపకుండా, వాణిజ్య మార్కెట్పై అలాగే వ్యవసాయ రంగంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, డీజిల్ కార్లపై అదనపు సుంకాలను వసూలు చేయడమే ఉత్తమమని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ, ఇప్పుడిప్పుడు పుంజుకుంటున్న డీజిల్ కార్ మార్కెట్ వృద్ధి రేటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








