డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంఖం పెంచాలి: చమురు శాఖ

పెట్రోల్ ధరలు భగ్గుమంటుడంతో వినియోగదారులు డీజిల్‌తో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డీజిల్ ఇంధనం మంచినీటి ప్రాయంగా ఖర్చయిపోతుంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో పెట్రోల్ కార్ల కన్నా ఎక్కువగా డీజిల్ కార్లే అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని పెంచినట్లయితే, డీజిల్ కార్ల ధరలు మరింత పెరిగి, వీటి అమ్మకాలు తగ్గుముఖ పట్టగలవని, ఫలితంగా డీజిల్ ఇంధన వినియోగం తగ్గుతుందనేది సర్కారు భావన. దీనికితోడు ప్రస్తుతం డీజిల్ ఇంధనాన్ని సబ్సిడి ధరకే విక్రయిస్తుండటంతో సర్కారుపై సబ్సిడి భారం తడిసి మోపెడవుతోంది. ఈ పరిస్థితులను గమనించిన కేంద్ర చమురు సహజవాయువు మంత్రిత్వశాఖ డీజిల్‌ కార్లపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సర (2012-13) బడ్జెట్‌ ప్రతి పాదనల్లో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదనను చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి ఎస్‌ఎస్‌ పళనిమానిక్యం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా వినియోగం అవుతున్న మొత్తం డీజిల్‌లో దాదాపు 15 శాతాన్ని ప్యాసింజర్ కార్లే తాగేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 9, 2012, 17:05 [IST]
English summary
The Ministry of Petroleum and Natural Gas is demanding an increase in excise duty on diesel cars with a view to discouraging consumption of subsidised fuel by personal vehicle owners.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+