వాహనాల ధరలను పెంచిన జనరల్ మోటార్స్

తాజా పెంపుతో జనరల్ మోటార్స్ అందిస్తున్న స్పార్క్, బీట్, క్రూజ్, తవేరా తదితర మోడళ్ల ధరలు రూ.3,000 నుండి రూ.15,000 వరకూ పెరిగాయి. వేల రూపాయల వరకూ రేట్లను పెంచినట్టు ప్రకటించింది. అయితే భారత మార్కెట్ను పెద్దగా ఆకట్టుకోని ఏవియో, ఆప్ట్రా, కాప్టివా ఎస్యూవిల ధరల జోలికి మాత్రం జనరల్ మోటార్స్ వెళ్లలేదు. వీటి ధరలను మార్చకుండా యధాతధంగా ఉంచామని కంపెనీ పేర్కొంది.
మార్కెట్ మందగమనం, నానాటికీ పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, ఆందోళన కలిగిస్తున్న రూపాయి మారకపు విలువ వంటి కారణాల వల్ల ధరలు పెంచాల్సి వస్తుందని జనరల్ మోటార్స్ ఉపాధ్యక్షుడు పి బాలేంద్రన్ తెలిపారు. కాగా.. ఇప్పటికే మారుతి సుజుకి కూడా, స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మినహా మిగిలిన అన్ని ఉత్పత్తుల ధరలను సుమారు రూ.17,000 లకు పైగా పెంచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








