తిరుపతికి విచ్చేసిన గోల్డ్ ప్లస్ 'గోల్డెన్ టాటా నానో'

తిరుపతిలోని ఎయిర్బైపాస్ రోడ్డులో ఉన్న పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లోని గోల్డ్ప్లస్ జ్యువెలరీ షోరూమ్లో ఈ గోల్డ్ నానో కారును ప్రదర్శనకు ఉంచారు. భారతదేశంలో ఒక్కోప్రాంతాని సంబంధించిన ఒక్కొక్క డిజైన్ను ఈ గోల్డ్ నానోపై చూడవచ్చు. టాటా గోల్డ్ ప్లస్ కంపెనీ ప్రచారంలో భాగంగా ఈ బంగారు నానో కారును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గోల్డ్ ప్లస్ అవుట్లెట్లలో ప్రదర్శించనుంది.
ఇందులో భాగంగానే కంపెనీ తమ బంగారు నానో కారును చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కూడా ప్రదర్శనకు ఉంచింది. దీని తయారీ కోసం 80 కేజీల స్వచ్ఛమైన బంగారాన్ని, 15 కేజీల వెండిని మరియు 10,000 రత్నాలను ఉపయోగించారు. ఈ బంగారు నానో కారు తయారీకి కంపెనీ సుమారు రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేసింది.


Click it and Unblock the Notifications








