డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకం పెంచేందుకు సర్కారు సన్నాహాలు

ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యుడు సతమవుతుంటే, తాజాగా డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకాలను పెంచేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. పెట్రోల్ ఇంధన ధరను, పెట్రోల్ కార్ల మైలేజ్‌ను చూసి భయపడుతున్న కస్టమర్లు తమకు ఇష్టం లేకపోయినా డీజిల్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్రోల్ కార్లకు డిమాండ్ తగ్గి డీజిల్ కార్లకు డిమాండు జోరందుకుంది.

ఈ నేపథ్యంలో, సబ్సిడి ధరకే విక్రయిస్తున్న డీజిల్ ఇంధన ధరలను పెంచడానికి బదులుగా, డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే వాటి వినియోగం తగ్గి ఫలితంగా డీజిల్ వినియోగం తగ్గుతుందనే సర్కారు భావన. అంతేకాకుండా.. ఈ సబ్సిడి విక్రయం కారణంగా ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతోంది. ఈ భారాన్ని తప్పించుకునేందుకు గానూ డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకం పెంచితే సరిపోతుందని కేంద్ర చమురు శాఖ, కేంద్ర ఆర్థిక శాఖకు సూచింది.

ప్రస్తుతం ఈ సూచనపై పరిశీలన జరుపుతున్నామని, ఇది భవిష్యత్తులో అమలు కావచ్చని ఆర్థిక శాఖ అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడాన్ని భారీ పరిశ్రమల శాఖ వ్యతిరేకిస్తోంది. ఇదే గనుక అమల్లోకి వస్తే.. కొనుగోలుదారులు డీజిల్ కార్లపై అదనంగా రూ.80,000 లకు పైగా చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటర్ డీజిల్‌ను రూ.15.35 నష్టానికి విక్రయిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 29, 2012, 10:33 [IST]
English summary
Amid widening price difference between petrol and diesel, the finance ministry is looking at the possibility of raising excise duty on diesel cars, a suggestion which was mooted long back by the oil ministry.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+