మారుతి అల్లర్లు: ప్లాన్ ప్రకారమే అవనిష్ కుమార్ హత్య
మారుతి సుజుకి అందించిన సమాచారం ప్రకారం, జావియర్ ఇన్సిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ నుంచి ఎమ్బిఏ చేసిన అవనిష్ కుమార్ గడచిన 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతను ఎల్లప్పుడూ తన ఉద్యోగ విధి నిర్వహణలో అవుట్స్టాండిగ్ ప్రతిభను కనబరిచేవాడని, పారిశ్రామిక నిబంధనలకు కట్టుబడి పనిచేసేవాడని కంపెనీ పేర్కొంది. అవనిష్ కుమార్ భార్య సపర్నా దేవ్ కేంద్ర రక్షణ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతని ఏ 10 ఏళ్ల కుమారుడు (అభియుదీప్) కూడా ఉన్నాడు.
అవనిష్ కుమార్ మరణవార్త వినగానే అతని కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పోస్ట్మార్టమ్ నివేదిక ప్రకారం, అవనిష్ ఊపిరి ఆడక, 100 శాతం కాలిన గాయాలతో, శరీరం గుర్తు పట్టలేని స్థితిలో మరణించాడు. అంతేకాకుండా, రెండు కాళ్ల ఎముకలు అక్కడక్కడా విరిగినట్లు కూడా ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించటం జరిగింది.


Click it and Unblock the Notifications









