హ్యుందాయ్ ఇండియా కొత్త ఉపాధ్యక్షుడిగా రాకేష్ శ్రీవాత్సవ
గడచిన వారంలో కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త వైస్ ప్రెసిండెంట్ను విధుల్లోకి తీసుకుంటున్నామని కంపెనీ పేర్కొంది. అరవింద్ సక్సేనా 2006లో హ్యుందాయ్లో చేరారు. అరవింద్ సక్సేనా రాజీనామా జులై 27 నుంచి అమల్లోకి స్తుంది.
ప్రస్తుతం అరవింద్ సక్సేనా ఫోక్స్వ్యాగన్ ఇండియా కంపెనీలో మార్కెటింగ్ విభాగాని హెడ్ నియామకం అయినట్లు సమాచారం. అరవింద్ సక్సేనా రాజీనామాకు గల కారణాన్ని వివరించేందుకు కంపెనీ యాజమాన్యం నిరాకరించింది. కాగా.. హెచ్ఎమ్ఐకు వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన రాకేష్ శ్రీవాత్సవ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియాలో కొత్త వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన రాకేష్ శ్రీవాత్సవ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కంపెనీలో చేరారు. ఇది వరకు మారుతి సుజుకి కంపెనీలో పనిచేసిన శ్రీవాత్సవకు పరిశ్రమలో 24 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.


Click it and Unblock the Notifications









