ఇండియా నుంచి యునైటెడ్ కింగ్డమ్కు బస్ రూట్
సుమారు 4,000 మైళ్ల దూరం ఉండే ఈ రూట్ ద్వారా బస్సులో ప్రయాణించడానికి మొత్తం 12 రోజుల సమయం పడుతుంది. ఈ బస్ రూట్ మొత్తం ఏడు దేశాలను (రష్యా, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్లు కలుపుకొని) తాకుతూ వెళ్తుంది. బిర్మింగ్హామ్లో కాశ్మీరీయులు ఎక్కువగా నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ను, యూకే రోడ్డు మార్గం ద్వారా కలపాలనే ఆలోచనతో ఈ బస్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఈ 12 రోజుల ప్రయాణానికి గానూ ఛార్జ్ చేసే బస్ టికెట్ ధర 130 బ్రిటీష్ పౌండ్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.11,000 లకు పైమాటే. ఏదేమైనప్పటికీ, ఈ బస్ రూట్ తాలిబన్ తీవ్రవాదులు దాక్కుని ఉండే క్వెట్టా, ఆఫ్ఘనిస్థాన్ బార్డర్ల ప్రయాణించాల్సి ఉన్న నేపథ్యంలో భద్రతాపరమైన సమస్యలు రావచ్చని భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే.. జీవితం మీద ఆశలు వదలుకొని అడ్వెంచర్ ప్రయాణం చేయాలనుకు వాళ్లు మాత్రమే బ్రిటన్ను బస్సులు వెళ్తారేమో..! మీరేమంటారు..?


Click it and Unblock the Notifications









