నష్టపరిహారం చెల్లించకుంటే పెట్రోల్ ధరలు పెంచుతాం: ఐఓసి

ప్రభుత్వ రంగ సంస్థలు సబ్సిడి ధరకే పెట్రోల్‌ను విక్రయిస్తుండటంతో ప్రతి లీటరు అమ్మకంపై రూ.8.04 చొప్పున నష్టపోతున్నాయి. ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని అలాకాని పక్షంలో పెట్రోల్ ధరను పెంచుతామని ఆయిల్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. వాస్తవానికి పెట్రోల్ ధరలను పెంచే అధికారం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఉన్నప్పటికీ, గతంలో జరిగిన ఐదు రాష్ట్రల కీలక అసెంబ్లీ ఎన్నికల కారణంగా, ప్రభుత్వం తమ సానుకూలత కోసం పెట్రోల్ ధరలను పెంచవద్దని చమురు కంపెనీలను కోరింది.

దీంతో చమురు కంపెనీలపై పెట్రో భారం తడిసి మోపెడయ్యింది. నిజానికి చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ప్రకారం ఇక్కడి మార్కెట్లో ధరలను పెంచడమో తగ్గించడమో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా చేసి ఉన్నా కస్టమర్లపై కొద్ది కొద్దిగా భారం పడుతూ వచ్చేది. చమురు కంపెనీలు తమపై పడుతున్న భారాన్ని కస్టమర్లపై మోపాలని యోచిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ప్రతి లీటరు పెట్రోల్‌పై సుమారు రూ.8 వరకూ పెరిగే ఆస్కారం ఉంది.

దీనికి భారతీయ రిజర్వు బ్యాంక్ కూడా చమురు కంపెనీలకే మద్దతు పలుకుతోంది. ఆర్థిక సమస్యలను నిలవరించాలంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచడం అవసరమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరుగుతాయనే దానిపై వాహన చోదకులు దృష్టంతా నెలకొని ఉంది. మొత్తమ్మీద ఎవరు ఎటుపోయినా, ఏది ఏమైనా తుదకు బలయ్యేది మాత్రం వినియోగదారుడే.

More from DriveSpark

Article Published On: Thursday, April 19, 2012, 10:31 [IST]
English summary
The Indian Oil Corporation (IOC) said that it is losing Rs8.04 per litre on petrol and would hike prices if the government does not compensate.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+