లైసెన్స్ లేకుండా బస్సు నడిపి యాక్సిడెంట్ చేసిన మంత్రి
ప్రముఖ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ, సరైన డ్రైవింగ్ లైసెన్సు లేకుండా బస్సు నడిపి యాక్సిడెంట్ ఓ ఆటోను నజ్జు నుజ్జు చేసిన ఘనత కర్ణాటక మంత్రికే దక్కింది. కర్ణాటక సర్కారులోని మత్స్యకారుల శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆనంద్ అస్నోటిక్, కర్ణాటకలోని కర్వార్లో కొత్త కెఎస్ఆర్టిసి బస్సును నడిపి ఎదురుగా ఉన్న ఓ గూడ్స్ క్యారియర్ ఢీకొట్టడం జరిగింది.
అదృష్టవశాత్తు సదరు ఆటోను నడుపుతున్న డ్రైవర్ చిన్నపాటి గాయలతో బయటపడ్డాడు. కర్వార్-హస్సన్, కర్వార్-హుబ్లి-మనిపాల్ రూట్లలో కెఎస్ఆర్టిసి కొత్త బస్ సర్వీసులను ప్రారంభించేందుకు విచ్చేసిన సదరు మంత్రివర్యులు సరైన లైసెన్స్ లేకుండానే బస్సును నడిపి అక్కడునన్న వారిని భయాందోళనలకు గురయ్యేలా చేశాడు.
సాధారణంగా ఇదే తప్పువు వేరే ఎవరైనా చేసుంటే సుమారు రూ.20,000 వరకూ నష్టపరిహారం వసూలు చేసేవారు. అంతేకాకుండా.. మోటార్ వాహన చట్టం ప్రకారం, సరైన చెల్లుబాటు లేని లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినందుకు గానూ జరిమానా కూడా విధించే వారు. అయితే, ఆయనగారు మంత్రి గారు కదా, అందుకే పోనీలే పాపం అని వదిలేశారు. మన దేశంలో "రాజుకో న్యాయం బీదకో న్యాయం" ఎప్పటి నుండో ఉన్నదే కదా..!!


Click it and Unblock the Notifications









