ఎయిర్ కండిషన్ థార్ను విడుదల చేసిన మహీంద్రా
మహీంద్రా థార్ ఎస్యూవీని ఆఫ్-రోడ్ అడ్వెంచర్ రైడ్లంటే ఇష్టపడేవారు, యువకులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే, తమ రోజూవారీ కార్యకలాపాల కోసం కూడా కొందరు ఈ ఎస్యూవీని కొనుగోలు చేస్తారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం వేసవి సీజన్ కూడా కావడంతో ఎయిర్ కండిషనింగ్తో కూడుకున్న ఈ సరికొత్త వేరియంట్ను మహీంద్రా అండ్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది.
కేవలం సిఆర్డి వెర్షన్లో మాత్రమే ఏసి ఫీచర్ను పరిచయం చేయటం జరిగింది. కాగా.. డిఐ వేరియంట్ థార్ ఏసి లేకుండా మార్కెట్లో లభిస్తుంది. ఏసి వేరియంట్ థార్ ధరను రూ.6,86,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఈ వేరియంట్లో ఉపయోగించిన 2.5 లీటర్ సిఆర్డిఈ కామన్ రైల్ టర్బో డీజిల్ ఇంజన్ 105 బిహెచ్పిల శక్తిని, 247 ఎన్ఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్తో లభిస్తుంది.


Click it and Unblock the Notifications









