రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించిన మహీంద్రా ఎక్స్యూవీ500

హైదరాబాద్లో మహీంద్రా ఎక్స్యూవీ500 ధర రూ.11.2 లక్షల నుండి రూ.12.57 లక్షల మధ్య ఉంది. కాగా.. తమ కొత్త మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీ కోసం బుకింగ్లను జనవరి 25 నుండి ఫిబ్రవరి 3 వరకూ తీసుకోనున్నామని, ఈ సమయంలో బుకింగ్ల సంఖ్య 7,200 యూనిట్లకుమించినట్లయితే, లక్కీడ్రా ద్వారా కొనుగోలు దారులను ఎంపిక చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా.. మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీకి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని అందించాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్యూవీ500 పూణేలోని ఛాక్కన్ ప్లాంటులో ఉత్పత్తి అవుతుంది. ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 2,500 యూనిట్లు, ఈ సంఖ్యను త్వరలోనే 3,000 యూనిట్లకు పెంచేందుకు కంపెనీ కసరత్తులు చేస్తోంది.


Click it and Unblock the Notifications








