ఎక్స్యూవీ500లో కూడా వాయిస్ కమాండ్ టెక్నాలజీ!
ప్రపంచ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా అండ్ మహీంద్రా తొలిసారిగా ఈ గ్లోబల్ మోడల్ను అభివృద్ధి చేసింది. ఈ ఎస్యూవీకి ఇప్పటికే ప్రపంచ మార్కెట్ల నుండి మంచి స్పందన లభిస్తోంది. అయితే, భారత మార్కెట్లో ఉత్పత్తి పరిమాణం దేశీయ డిమాండును తీర్చడానికే సరిపోకపోతుండటంతో ఈ మోడల్ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేయటాన్ని కంపెనీ వాయిదా వేసింది.
మహీంద్రా పరిచయం చేసిన వాయిస్ కంట్రోల్ యాక్టివేషన్ సిస్టమ్లో వాయిస్ కమాండ్లను ఇవ్వడం ద్వారా వాహనంలో ఆటోమేటిక్గా కొన్ని చర్యలు జరుగుతుంటాయి. అంటే.. ఉదాహరణకు హెడ్ల్యాంప్స్ ఆన్/ఆఫ్, డోర్స్ లాక్/అన్లాక్, వైపర్స్ ఆన్/ఆఫ్, వాల్యూమ్ అప్/డౌన్, ఎఫ్ఎమ్ ఛానెల్ చేంజ్, హజార్డ్ ఆన్/ఆఫ్, బ్లూటూత్ ద్వారా ఫోన్ కాల్స్ వంటి సుమారు 30 కమాండ్లను ఆపరేట్ చేయవచ్చు.
అంతేకాకుండా.. ఇందులో డోర్ సరిగ్గా వేయకపోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వంటి 15 సేఫ్టీకి సంబంధించి ఏవైనా లోపాలు గుర్తించినా వాయిస్ మెసేజ్ల ద్వారా ఇది డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఎక్స్యూవీ500 ఎస్యూవీకి ఈ అదనపు ఫీచర్ను జోడించినట్లయితే, దీని అమ్మకాలు మరింత పుంజుకునే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications









