మహీంద్రా ఎక్స్యూవీ500 భేష్.. అయినా లాభాలు మటాష్..

గడచిన ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ 10 కాలంలో కంపెనీ నికర లాభం రూ.737.38 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు ద్వారా వచ్చిన ఆదాయం రూ.6,074.5 కోట్ల నుండి రూ.8,327.2 కోట్లకు పెరిగి 37 శాతం వృద్ధిని నమోదు చేసుకుందని, ఇదే సమయంలో ముడిసరుకుల వ్యయం రూ.3,777.4 కోట్ల నుండి రూ.4,579.2 కోట్లకు పెరిగిందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటో, ఫామ్ ఎక్విప్మెంట్) పవన్ గోయెంకా తెలిపారు.
రూపాయి విలువ క్షీణత, పెరిగిన ముడిసరుకుల ధరల కారణంగా లాభాలు క్షీణించాయని కంపెనీ పేర్కొంది. ఈ ఫలితాల ప్రభావంతో బీఎస్ఈలో కంపెనీ షేరు ధర దాదాపు 3 శాతం క్షీణించి రూ. 689.5 వద్ద ముగిసింది. మహీంద్రా ప్రవేశపెట్టిన కొత్త గ్లోబల్ ఎస్యూవీ ఎక్స్యూవీ500 వల్ల కంపెనీ అమ్మకాలు 30 శాతం మేర వృద్ధి చెందాయని పవన్ తెలిపారు. కాగా.. ఎక్స్యూవీ500 కోసం జనవరిలో ప్రారభించిన సెకండ్ ఫేజ్ బుకింగ్లలో 25,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చాయని కంపెన పేర్కొంది.


Click it and Unblock the Notifications








