నేటి నుండి మహీంద్రా ఎక్స్యూవీ500 బుకింగ్స్ ప్రారంభం

సాధారణంగా ఏ కంపెనీ అయినా ముందు వచ్చిన బుకింగ్లు ముందు డెలివరీ చేయాలనే ప్రతిపాదన మీద బుకింగ్లను స్వీకరిస్తాయి. అయితే మహీంద్రా మాత్రం, ముందు వచ్చినా లేక వెనుక వచ్చినా మీ లక్ బాగుంటేనే బుకింగ్ దక్కుతుందని అంటోంది. మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీకి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉండటం, ఈ ఎస్యూవీ కోసం ఇప్పటికే అనేక మంది క్యూలో ఉండటం వలన కంపెనీ కొద్ది రోజులు మాత్రమే బుకింగ్లను తీసుకుంటుంది.
ఈ పది రోజుల్లో రెండవ బ్యాచ్ బుకింగ్స్ గనుక 7,200 యూనిట్లను దాటినట్లయితే లక్కీడ్రా ప్రాతిపదికన కొనుగోలు దారులను ఎంపిక చేస్తామని ఎమ్ అండ్ ఎమ్ ఇదివరకే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ లక్కీ డ్రా ధరఖాస్తు ఫారమ్ కోసం వినియోగదారులు రూ.80,000 లను చెల్లించాల్సి ఉంటుందని, లక్కీడ్రా ఫలితాలను ఫిబ్రవరి 15న వెల్లడిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ ఆటోమోటివ్ సెక్టార్) వివేక్ నయ్యర్ తెలిపారు.


Click it and Unblock the Notifications








