మారుతి మానేసర్ ప్లాంట్‌లో ఉత్పత్తి బంద్; కార్మికుల అరెస్ట్

మారుతి సుజుకి మానేసర్ ప్లాంటు మరోసారి సమ్మె సెగతో భగ్గుమంది. బుధవారం ప్లాంటులో కార్మికులకు సూపర్‌వైజర్లకు మధ్య జరిగిన గొడవలో మరణించిన వ్యక్తిని కంపెనీ జనరల్ మేనేజర్ హ్యుమన్ రిసోర్స్‌గా గుర్తించారు. కార్మికుల్లో ఒక గుంపు గొడవ పడుతోండగా, మరొక గుంపు హెచ్ కార్యాలయానికి నిప్పంటించింది. దీంతో ఆఫీసులోనే ఉండిపోయిన జిఎమ్-హెచ్ఆర్ అవనిష్ కుమార్ దేవ్ సజీవ దహనం అయ్యాడు.

ఈ కేసులో పోలీసులు 91 మంది కార్మికులను అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు. వీరందరిపై ఆయుధాల వినియోగం, హత్య, హత్యాయత్నం, చట్టవ్యతిరేక సమావేశం, కొట్లాట వంటి వివిధ కేసులను బుక్ చేశారు. స్తుతం మానేసర్ ప్లాంటు పూర్తిగా పోలీసుల స్వాధీనంలో ఉంది. సుమారు 3,000 మందికి పైగా పోలీసులు మానేసర్ ప్లాంటు పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఫ్యాక్టరీ లాకవుట్ పరిస్థితులను ఎదుర్కునే సూచనలు కనిపిస్తున్నాయి.

ఓ వర్కర్‌ను కులం పేరు పెట్టి దూషించి, అతనిపై చేయి చేసుకోవటమే కాకుండా, సస్పెండ్ కూడా చేయడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో కార్మికులు అనేక మంది కంపెనీ ప్రతినిధులు, మేనేజర్లు సూపర్‌వైజర్లపై దాడికి దిగారు. ఆఫీసు భవంతులు, సెక్యూరిటీ కార్యాలయాలు, ఫైర్ సేఫ్టీ విభాగాలను ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ప్రభుత్వం, పోలీసులు హామీ ఇచ్చారు.

More from DriveSpark

Article Published On: Friday, July 20, 2012, 10:27 [IST]
English summary
The chaos at Maruti Suzuki's Manesar plant has reduced today after more than 1,200 policemen were posted at the plant to maintain law and order. The violet strike that lead to the death of one official and left many injured is being probed by a special investigation team of Haryana police.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+