ఆల్టో ఉత్పత్తి ఆపివేసే ప్రసక్తే లేదు...: మారుతి సుజుకి
మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టిన ఆల్టో బ్రాండ్ను ప్రజలకు దూరం చేయబోమని, వచ్చే సంవత్సరంలో ఓ సరికొత్త అప్గ్రేడెడ్ ఆల్టో కారును ప్రజల ముందుకు తీసుకురానున్నామని కంపెనీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే, కంపెనీ మొట్టమొదట మార్కెట్లోకి విడుదల చేసిన ఎమ్800 కారు ఉత్పత్తిని కూడా నిలిపివేయలేదని, బిఎస్4 (భారత్ స్టేజ్ 4) కాలుష్య నిబంధనలు పాటించే కొన్ని ప్రధాన మెట్రో నగరాల్లో మాత్రమే వీటి అమ్మకాలను నిలిపివేశామని ఆయన అన్నారు.
మారుతి ఆల్టో ఒక్క భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా మాత్రమే కాకుండా, ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో సైతం స్థానం దక్కించుకుంది. భారత మార్కెట్లో సంవత్సరానికి మూడు లక్షలకు పైగా ఆల్టో కార్లు అమ్ముడవుతున్నాయి. గడచిన సంవత్సరంలో కంపెనీ 3.1 లక్షల ఆల్టో కార్లను విక్రయించింది.


Click it and Unblock the Notifications









