గుర్గావ్లో డీజిల్ ఇంజన్ ప్లాంటును ఏర్పాటు చేయనున్న మారుతి

వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి సాలీనా 1.5 లక్షల డీజిల్ ఇంజన్లను తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం డీజిల్ కార్లకు పెరిగుతున్న డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తులను అందించేందుకు ఇది సహకరించనుంది. డీజిల్ ఇంజన్ల సరఫరా కోసం మారుతి సుజుకి, ఇప్పటికే ఫియట్ కంపెనీతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ ప్లాంటు గనుక ప్రారంభమైతే, మారుతి సుజుకి ఇండియాకు ఇది భారత్లో తొలి స్వంత డీజిల్ ఇంజన్ ప్లాంటు కానుంది, ఈ ప్లాంటు కోసం కంపెనీ సుమారు రూ.1000 కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు సమాచారం. ఈ ప్లాంటు పూర్తిగా అమల్లోకి వచ్చినట్లయితే, మారుతి సుజుకి డీజిల్ కార్ల వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గిపోవడం ఖాయం..!!


Click it and Unblock the Notifications








