సరికొత్త అవుట్లాండర్ ఎస్యూవీని ఆవిష్కరించిన మిత్సుబిషి
ప్రస్తుతం మిత్సుబిషి ఆవిష్కరించి ఈ సరికొత్త క్రాసోవర్ మూడవ తరానికి చెందింది. గడచిన 2001లో తొలిసారిగా అవుట్లాండర్ను కంపెనీ విడుదల చేసింది. ఈ మిడ్-సైజ్ క్రాసోవర్ ప్రీమియం వెహికల్గా ప్రవేశపెట్టేందుకు మిత్సుబిషి దీనిని గ్లోబల్ ఫ్లాట్ఫామ్ ఆధారంగా డిజైన్ చేసింది. పర్యావరణంపై తక్కువ ప్రభావం, మరింత భద్రత, సౌకర్యవతంమైన డ్రైవింగ్, క్లెవర్ యుటిలిటీ, అదనపు కన్వీనెస్స్ అనే ఐదు సూత్రాలను ఆధారంగా చేసుకు మిత్సుబిషి ఈ సరికొత్త తర్వాతి తరం అవుట్లాండర్ క్రాసోవర్ను అభివృద్ధి చేసింది.
ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్లో సరికొత్త 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ లేదా సివిటీ గేర్బాక్స్తో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్తో లభ్యం కానుంది. డీజిల్ వేరియంట్లో సరికొత్త 2.2 లీటర్ డిఐడి క్లీన్ డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్తో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications









