గల్ఫ్ ఆయిల్ ప్రచారకర్తగా మహేంద్ర సింగ్ ధోనీ

ఈ డీల్లో భాగంగా, గల్ఫ్ ఆయిల్ ఉత్పత్తులకు మహేంద్ర సింగ్ ధోనీ ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత ఐపిఎల్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని 'సిగ్నేచర్ ఎమ్ఎస్డి ప్యాక్స్' పేరిట పరిమిత సంఖ్యలో స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని సంస్థ చైర్మన్ సంజయ్ హిందుజా వెల్లడించారు.
ఇదిలా ఉండగా, భారతీయులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో దక్షిణ భారతదేశంలో ఓ లూబ్రికేషన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని గల్ఫ్ ఆయిల్ ఇంటర్నేషల్ లిమిటెడ్ భావిస్తోంది. ఈ కొత్త ప్లాంటును తమిళనాడులో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది. ఇందు కోసం కంపెనీ రూ.150 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది.


Click it and Unblock the Notifications








