డీజిల్ కార్లపై అధనపు పన్నులు విధించడం సరికాదు..!!
కాగా.. డీజిల్ కార్లపై అదనపు పన్నులు వసూలు చేస్తే పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు మైఖేల్ బోన్హామ్ ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్ కార్లపై అధనపు సుంఖాలను విధించాలన్న ప్రభుత్వం ప్రతిపాదనలను ఆయన వ్యతిరేఖించారు. దీని గురించి బోన్హామ్ స్పందిస్తూ.. ఇప్పటికే అధిక వడ్డీ రేట్లతో సతమతవుతున్న పరిస్థితుల్లో డీజిల్ కార్లపై అదనపు పన్నులు వసూలు చేయడం సరికాదని, ఇది తిరోగామి చర్య అని అభిప్రాయ పడ్డారు. కొత్త పన్నులు విధించినట్లయితే, డీజిల్ కార్ల ధరలు రూ.80,000 వరకూ పెరగవచ్చని ఆయన అన్నారు.
డీజిల్ కార్లపై అదనపు సుంకాలను వసూలు చేయడానికి బదులు ప్రతి లీటరుపై 75 పైసలు చొప్పున పెంచినట్లయితే, అంతే ఆదాయాన్ని పొందవచ్చని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలపై ప్రభుత్వం నియంత్రణలు ఎత్తివేయడం, ఫలితంగా చమురు కంపెనీలు తమ ఇష్టానుసారం ధరలను పెంచుతుండటంతో కొనుగోలుదారులు డీజిల్ కార్లపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఫలితంగా పెట్రోల్ ఇంధన వినియోగం తగ్గి డీజిల్ ఇంధన గణనీయంగా పెరిగింది. డీజిల్ ధరలపై నియంత్రణ ప్రస్తుతానికి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది.
డీజిల్ ఇంధనాన్ని ఇలానే వినియోగించుకుంటూ పోతే భవిష్యత్తులో డీజిల్ ఇంధన కొరత ఏర్పడుతుందనే ఉద్దేశ్యంతో డీజిల్ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు గానూ ప్రభుత్వం డీజిల్ కార్లపై అదనపు సుంకాలను విధించాలని యోచిస్తోంది. ఇలా చేయడం వలన డీజిల్ కార్ల వినియోగం కాస్తయినా తగ్గి ఇంధన అవుతుందనేది ప్రభుత్వం యోచన. ఏదేమైనప్పటికీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వలన చివరిగా వినియోగదారుడి నెత్తిపైనే అధనపు భారం పడుతుండటం శోచనీయం..!


Click it and Unblock the Notifications









