నిస్సాన్ మైక్రా, పెట్రోల్ వెర్షన్ సన్నీ ధరల పెంపు

మూడు వేరియంట్లలో లభ్యమవుతున్న పెట్రోల్ మైక్రా వెర్షన్ ధరలు రూ.3,000, రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న డీజిల్ మైక్రా ధరలు రూ.12,000 చొప్పున పెరిగాయి. పెట్రోల్ వెర్షన్ సన్నీలో లభిస్తున్న మూడు వేరియంట్ల ధర రూ.5,000 మేర పెరిగాయి. పెట్రోల్ వెర్షన్ సన్నీను గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో కంపెనీ విడుదల చేసింది.
అయితే, గడచిన డిసెంబర్ నెలలో విడుదలైన సన్నీ సెడాన్ డీజిల్ వేరియంట్లను మాత్రం కంపెనీ పెంచలేదు. నిస్సాన్ సన్నీ డీజిల్ రెండు వేరియంట్లలో (ఎక్స్ఎస్, ఎక్స్వి) లభ్యమవుతుంది. ఎక్స్ఎల్ వేరింట్ ధర రూ.7.98 లక్షలుగా ఉండగా, ఎక్స్వి వేరియంట్ ధర రూ.8.78 లక్షలుగా ఉంది (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
పెరిగిన ఇన్పుట్ ధరలు, డాలర్తో పోల్చుకుంటే క్షీణిస్తున్న రూపాయి మారకపు విలువ తదితర అంశాల కారణంగా తమకు వేరే మార్గం లేక ధరలను పెంచాల్సి వస్తుందని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిమినోబు టోకుయమా తెలిపారు. అయితే, వినియోగదారుల మనస్సును దృష్టిలో ఉంచుకొని మార్జినల్గానే ధరలను పెంచామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








