మేడ్ ఇన్ ఇండియా మైక్రా కార్లను రీకాల్ చేసిన నిస్సాన్
ఇండియన్ మార్కెట్లో దూసుకుపోతున్న నిస్సాన్ మైక్రాకు ఫారిన్ మార్కెట్లో పెద్ద బ్రేక్ పడింది. మైక్రాలో అమర్చిన సెన్సార్ల సమస్య కారణంగా ఇండియాలో తయారై విదేశీ మార్కెట్లలో అమ్ముడైన మైక్రా కార్లను రీకాల్ చేస్తున్నట్లు నిస్సాన్ పేర్కొంది. ఈ రీకాల్లో కేవలం మేడ్ ఇన్ ఇండియా మైక్రా కార్లు మాత్రమే కాకుండా.. జపాన్లో తయారైన సెరెనా, పాట్రాల్, ఇన్ఫినిటి ఎమ్, ఇన్ఫినిటి క్యూఎక్స్, చైనాలో తయారైన టీడా వంటి ఏడు మోడళ్లు కూడా ఉన్నాయి.
ఈ కార్లలో అమర్చిన లూజ్ సెన్సార్ల కారణంగా అత్యవర పరిస్థితుల్లో ఇంధనం లీక్ అయ్యే ప్రమాదం ఉన్న కారణంగా మొత్తం 2,49,522 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు నిస్సాన్ ప్రతినిధి తెలిపారు. వీటిలో దాదాపు 9,600 యూనిట్లకు పైగా నిస్సాన్ మైక్రా కార్లు ఉన్నాయి. రీకాల్ చేసిన మొత్తం కార్లలో 92,679 కార్లు జపాన్లో ఉన్నాయి. అయితే ఈ సెన్సార్ల సమస్య కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు సంభవించలేదని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications









